1, ఆగస్టు 2013, గురువారం

చిన్నప్పటి నుండీ వాడు తేడాయే !



ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం లోగడ చూస్తే సరే. లేదా వినండి ...

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నేయిలను గల్గ దిట్టియహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !



భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)

వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.

ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.

వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.

ఇక భారత యుద్ధం తప్పదు !



వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :

రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను



కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?

వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
  




1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

కవిగారి ప్రతిభకు జోహార్లు.అంత చిన్న పద్యంలో దత్తపదిని భారతార్థంలో పూరించారు .సెబాసు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి