8, ఏప్రిల్ 2014, మంగళవారం

పా.సీ. కొ.సా ...




‘‘తాతయ్యా, కథ చెప్పవూ ? ’’
‘‘ఎందుకు చెప్పన్రా బాబూ, విను ...’’
‘‘ అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వో రోజు వేటకెళ్ళారు. వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ... ... ...’’
‘‘ ఛీ ! ... తాతయ్యా, మళ్ళీ పాత కథేనా ? కొత్త కథ చెప్పూ ...’’
‘‘ అయితే విను. అనగనగా ఓ చక్రవర్తి. ఆ చక్రవర్తికి పది మంది కొడుకులు. పది మందీ ఓ రోజు సింగపూర్ వెళ్ళి పన్నెండు పీతల్ని తెచ్చారు. వాటిని ఎండ పెడితే వాటిలో ... ... ’’
‘‘ ఛీ ! తాతయ్యా, మళ్ళీ పాత కథే చెబుతున్నావు ...’’

‘‘ అదేంటిరా మనవడా అలాగంటావూ ! పాత కథలో రాజు ఈ కథలో చక్రవర్తి అయిపోయేడు కదూ ... వాడికి ఏడుగురు కొడుకులయితే, వీడికి పదిమంది ...వాళ్ళు వేటకి వెళితే, వీళ్ళు సింగపూర్ వెళ్ళారు కదా ? ... వాళ్ళు చేపలు తెస్తే, వీళ్ళు పీతలు తెచ్చారు ...అదీ కాక, పాత కథకి ఊరూ పేరూ లేదు ... కానీ ఈ కొత్త కథకి మాత్రం ఓ నేరుందిరా అబ్బీ ! ...’’

‘‘ ఈ కథ పేరేంటి తాతయ్యా ? ’’

‘‘ ఎన్నికల మేనిఫెష్టో ’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి